స్వాంతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న స్మారక పోస్టర్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కిందపడిపోయారు. పోస్టర్ కవర్ ఆవిష్కరణకు మంత్రి ధర్మాన కృష్ణదాస్తోపాటు ఎంపి రామ్మోహన్నాయుడు , అచ్చెన్నాయుడు హాజరయ్యారు. అప్పటికే వేదికపై సోఫాలో రామ్మోహన్నాయుడు కూర్చొన్నారు. ఈ తర్వాత అచ్చెన్న కూర్చోగానే సోఫా ఒక్కసారిగా వెనక్కి ఒరిగింది. దీంతో అచ్చెన్నతోపాటు రామ్మోహన్నాయుడు కిందపడిపోయారు. వెంటనే భధ్రతా సిబ్బంది ఇరువురినీ పైకి లేపారు.