బాలీవుడ్లో కరోనా కలకలం రేపుతోంది. ఇండస్ట్రీకి చెందిన పలువురిపై కరోనా పంజా విసిరింది. ఇటీవల కాలంలో బాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖులు కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనీల్ సూరి మరణించారు. అనీల్ సోదరుడు , నిర్మాత రాజీవ్ సూరీ మాట్లాడుతూ.. అనీల్ జూన్ 2 నుండి హై ఫీవర్తో బాధపడుతున్నారని తెలిపారు. ఆ తర్వాత రోజు నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందన్నారు. దీంతో అనీల్ సూరిని వెంటనే లీలావతి, హిందూజా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. అయితే ఆస్పత్రి సిబ్బంది సైతం ఆయనను అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించారని ని అనీల్ సోదరుడు తెలిపారు.
దీంతో ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనీల్ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం కన్నుమూశారు. శుక్రవారం ఉదయం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అనీల్ అంత్యక్రియలు నిర్వహించారు. అనీల్కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.