అమ్మ చంద్రబాబూ..ఎంతటి ఘనుడవయ్యా

అమ్మ చంద్రబాబూ..ఎతటి ఘనుడవయ్యా : బొత్స

అమ్మ చంద్రబాబు నాయుడూ.. ఎంతటి ఘనుడవయ్యా.. మేం మొదటి నుంచే చెప్పుకొస్తున్నామన్నారు. ఏదైనా అమరాతి పేరుపైనా రాజధానిని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యవస్థగా వ్యాపారంగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారని బొత్స ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రూ.46వేల కోట్ల అవినీతి జరిగినట్టు బొత్స వెల్లడించారు.

ఎన్నికలకు ముందే రూ.46వేల కోట్లకు టెండర్లు పిలిచారని అన్నారు. దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని, తమకు అభివృద్ధి ముఖ్యమన్నారు. చంద్రబాబు అవినీతి పరుడని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. పేదల ఇళ్ల పేరుతో కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడరని ఆరోపించారు. చంద్రబాబు ఏ విధంగా దోచుకున్నారో అర్థమవుతోందన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఇళ్లలో కూడా ఐటీ సోదాలు చేయాలని బొత్స చెప్పారు.