బలపాలు.. మనందరికీ తెలుసు..? వీటిని రాయడానికి ఉపయోగిస్తారు.. కానీ కొందరు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలు మాత్రమే కాకుండా .. పెద్దలు కూడా పెట్టెలు కొద్దీ బలపాలను తినేస్తుంటారు.బలపాలు విషపూరితమైన పదార్థం కాదు. అయితే వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది సున్నంతో తయారు చేస్తారు.బలపాలు తినే అలవాటు ఉన్న వారిలో పీకా సమస్యలకు గురవుతారని ఈ సమస్య ఉన్నవారు మట్టి, సుద్ద, బలపం చూసినప్పుడు నోరూరిపోతుంది. దీనినే ఈటింగ్ డిసార్డర్ ...
Read More »Homepge Slider
సీఎం జగన్పై దాడి కేసులో పురోగతి!
విజయవాడలో సీఎం జగన్పై రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఐదుగురు అనుమానితులు ఉండగా.. వారిలో ఒక యువకుడు దాడి చేసినట్లు సమాచారం. దాడి చేసిన వ్యక్తి అజిత్సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వాడిగా భావిస్తున్నారు. సీసీ కెమెరాలు, ఇతర వీడియోల్లో నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read More »రూ.2లక్షల రుణమాఫీ.. మంత్రి కీలక విజ్ఞప్తి
రూ.2లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని.. అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకులను కోరారు. CM, డిప్యూటీ CM, అధికారులతో చర్చించి రుణమాఫీ చేస్తామన్నారు. అటు రైతుభరోసా సాయం కోసం ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించి, సొమ్ము అందిస్తామన్నారు. ఇక వానాకాలం సీజను సంబంధించి పంటలకు అవసరమైన విత్తన సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Read More »కవితకు రెగ్యులర్ బెయిల్ వస్తుందా.?
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ లో ఉంది. మరోవైపు, తాను నిర్దోషినని, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు కోర్టులో విచారణ జరగనుంది. తనపై అక్రమంగా కేసు పెట్టారని ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్ లో కవిత పేర్కొన్నారు. అప్రూవర్ గా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తనను కేసులో ...
Read More »ఆ ప్రచారంలో నిజం లేదు: ఎన్నికల సంఘం
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయం ఇకపై ఉండదనే ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం అందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. విధుల్లో ఉన్న ఉద్యోగులు సంబంధిత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. మరోవైపు ఇప్పటికే తొలి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పూర్తయింది.
Read More »ఏపీలో కీలక నేతల భార్యల ప్రచారం..
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో కలిపి నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18 రానుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని కీలక పార్టీలు తమ ప్రచారాన్ని మొదలు పెట్టాయి. దాదాపు అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మరో స్థాయి యుద్దమే నడుస్తుంది. కాగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కీలక నేతలను గెలిపించుకునేందుకు వారి భార్యలు రంగంలోకి దిగారు. ఎప్పుడు ...
Read More »జగన్ కోసం మానవ బాంబునవుతా: MLA అభ్యర్థి
టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ను చంపాలని చూస్తే మానవ బాంబుగా మారేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తనలాంటి వారు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్పై దాడిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగనన్ను ఏం చేయాలనుకుంటున్నారని దువ్వాడ ప్రశ్నించారు.
Read More »నేడు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బీఆర్ఎస్ సంగారెడ్డి సుల్తాన్పూర్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనుంది. పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సభలో పాల్గొంటారు. ఇప్పటికే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు.
Read More »CM జగన్ నేటి బస్సు యాత్ర షెడ్యూల్
జగన్ చేపట్టిన బస్సు యాత్ర 16వ రోజైన నేటి షెడ్యూల్ను YCP విడుదల చేసింది. నిన్న బస చేసిన నారాయణపురం నుంచి బయల్దేరనున్న CM.. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం అనంతరం బయల్దేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ వద్ద జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి శిబిరానికి చేరుకుంటారు.
Read More »మీ బిడ్డ అదరడు.. బెదరడు: సీఎం జగన్
పేదల భవిష్యత్తు, పథకాల కొనసాగింపు కోసం వైసీపీని గెలిపించాలని సీఎం జగన్ కోరారు. గుడివాడ సభలో మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వానికి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. ఒక్క జగన్ ను ఎదుర్కొనేందుకు కుట్రదారులు చుట్టుముట్టారు. కుటిల పద్మవ్యూహంలో నాపై వీరంతా దాడి చేస్తున్నారు. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు.. బెదరడు. కృష్ణుడనే ప్రజలు నాకు అండగా ఉన్నారు. మన విజయం తథ్యం’ అని చెప్పుకొచ్చారు.
Read More »