Politics

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో వాన పడుతోంది. హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అకాల వర్షాలకు వరి కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు ఆరబోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read More »

నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ అడుగుపెట్టనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి నుంచి అనకాపల్లి నియోజకవర్గం మీదుగా పెందుర్తి చేరుకోనున్నారు. సా.3.30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభ ఉండనుంది.

Read More »

కేసీఆర్ బ‌స్సు యాత్ర షెడ్యూల్ ఖ‌రారు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సుయాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు తాజాగా ఈ బ‌స్సు యాత్ర షెడ్యూల్ ఖ‌రారైంది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో రాష్ట్రంలో చేప‌ట్టిన‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్లే యోచ‌న‌లో గులాబీ బాస్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌, బీజేపీ వైఫ‌ల్యాల‌ను కూడా ఎత్తిచూప‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ యాత్ర‌కు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా దెబ్బ‌తిన్న గులాబీ ...

Read More »

నెల్లూరు జిల్లాలో జనసేనకు భారీ షాక్.. వైసీపీలో చేరిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు జిల్లాలో టీడీపీ, జనసేనకు భారీ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పారు. అంతేకాదు వైసీపీలో చేరారు. జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డితో పాటు నెల్లూరు మండల అధ్యక్షుడు కాటం రెడ్డి జగదీశ్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ నేత చేజెర్ల సుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో జిల్లాలో ...

Read More »

అధికారులపై ఫిర్యాదులు..ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం:ఎంకే మీనా

ఏపీ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకర పదజాలం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులపై కొందరు ముఖ్య నాయకులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ...

Read More »

హ్యాపీ బర్త్ డే అమ్మా: జగన్, షర్మిల

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ జన్మదినం నేడు. ఈ సందర్భంగా తన తల్లికి జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా’ అని ట్వీట్ చేశారు. ఓ కార్యక్రమంలో తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి, ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ ...

Read More »

బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు ప్రకాశ్ గౌడ్ కలిశారు. తన అనుచరులతో కలిసి ఈరోజో, రేపో కాంగ్రెస్ లో చేరుతానని రేవంత్ కు ప్రకాశ్ గౌడ్ తెలిపారు. రేవంత్ సమక్షంలోనే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

Read More »

నందమూరి బాలకృష్ణ ఓ బఫూన్ : శిల్ప చక్రపాణి రెడ్డి

నందమూరి బాలకృష్ణ ఓ బఫూన్ అంటూ మండిపడ్డారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. నందమూరి బాలకృష్ణపై రెచ్చిపోయిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి…బాలకృష్ణ ఓ బఫూన్ అంటూ విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.బాలయ్య ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదన్నారు. సంక్షేమ పథకాలే వైసీపీని మరోసారి అధికారంలోకి తెస్తాయని వివరించారు శిల్ప చక్రపాణి రెడ్డి. సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయని…మళ్లీ జగన్‌ ప్రభుత్వం రాబోతుందన్నారు శిల్ప చక్రపాణి రెడ్డి.

Read More »

నేడు ఒవైసీ నామినేషన్

లోక్సభ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థిగా అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ సమీపంలోని చారిత్రక మక్కా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి కార్యకర్తలతో ఊరేగింపుగా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read More »

ప్రతి ఓటు ముఖ్యమే: ప్రధాని మోదీ

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ‘ఇవాళ 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు వచ్చినవారు తప్పకుండా అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనాలి. ప్రతి ఓటు, ప్రతి ఒక్కరి వాయిస్ ముఖ్యమే’ అని మోదీ ట్వీట్ చేశారు.

Read More »