మరో 10 రోజుల్లో పిఆర్‌సి ప్రకటిస్తాం..

మరో 10 రోజుల్లో పిఆర్‌సిని ప్రకటిస్తామని ఎపి సిఎం జగన్‌ శుక్రవారం పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సిఎం తిరుపతిలో పర్యటిస్తున్నారు. పలు ఉద్యోగ సంఘాలు ఆయనను కలిసి.. తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా స్పందించిన సిఎం.. పిఆర్‌సి ప్రక్రియ పూర్తయిందని, మరో 10 రోజుల్లో ప్రకటిస్తామని  ఉద్యోగ సంఘాలకు హామీ  ఇచ్చారు.