ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. సిఎం పర్యటన వేళ.. భీమవరంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సిఎం జగన్ హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకల్లో మంత్రి శ్రీరంగనాథ రాజు, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఎంపి కె.శ్రీధర్, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, ప్రసాదరాజు, అబ్బయ్య చౌదరి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు.
