దత్తపీఠంలో అమ్మవారిని దర్శించుకున్న జగన్‌

జగన్‌ విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సచ్చిదానంద స్వామితో సమావేశమై, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సోమవారం శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు.  మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని, పేర్ని నాని, మేయర్ బాగ్యలక్ష్మి  తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు.