దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 18,800కుపైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాష్ట్రపతిభవన్లో పనిచేసే ఉద్యోగి కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ తేలిందనే వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా పార్లమెంట్లోని లోక్సభలో పనిచేసే ఒక ఉద్యోగి కోవిడ్-19 పాజిటివ్గా తేలాడు. లోక్సభలోని హౌస్కీపింగ్ విభాగంలో అతను పనిచేస్తాడని అధికారులు తెలిపారు.
తాజాగా పరీక్షలో పాజిటివ్గా తేలడంతో వెంటనే అతడిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అతనికి భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అలాగే మనవలు కూడా అతనితో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ తొలి రెండు స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే.