ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 41,806 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,87,880 కి చేరింది. ఇందులో 3,01,43,850 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 4,32,041 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 581 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,11,989 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 39,130 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.