కాసేపట్లో మోడీ ఏరియర్ సర్వే

 కాసేపట్లో యాస్‌ తుపాను ప్రభావం అధికంగా పడిన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ప్రధాని మోడి ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాని సమీక్ష సమావేశాలను చేపట్టనున్నారని, ఏరియల్‌ సర్వే సైతం చేపడతారని స్పష్టం చేసింది. సైక్లోన్‌ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ప్రధాన మంత్రి విమానంలో నుంచి ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. యాస్‌ తుఫాను వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో ఏ మేరకు ప్రభావం పడిందీ అంచనా వేయడానికిగాను నిర్వహించే సమీక్ష సమావేశాలకు మోడి అధ్యక్షత వహిస్తారు. బెంగాల్‌ లో నిర్వహించే సమీక్షా సమావేశంలో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొననున్నారు.