బ్యాంకు రుణాల మళ్లింపు వ్యవహారంలో తెరాస లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నామాతో పాటు మధుకాన్ కేసులో నిందితులందరికి ఇడి సమన్లు పంపింది. జాతీయరహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాల కోసం మళ్లించినట్లు మధుకాన్ గ్రూప్పై ఇడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపి నామాకు చెందిన మధుకాన్ సంస్థతో పాటు గ్రూప్ డైరెక్టర్ నివాసాల్లో ఇడి గత రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో భాగంగా భారీగా నగదు, ముఖ్యమైన పత్రాలను అధికారులను స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలతో పాటు బ్యాంకు ఖాతాలు, హార్డ్ డిస్కులను ఇడి అధికారులు పరిశీలిస్తున్నారు.