మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఛాతి నొప్పి రావడంతో.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు హుటా హుటిన తరలించారు. ప్రస్తుతం రాయపాటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. లాక్ డౌన్ కావడంతో ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు. రాయపాటి అస్వస్థతకు గురయ్యాని తెలియడంతో టీడీపీ ముఖ్యనేతలు కుటుంబ సభ్యుల్ని ఫోన్లో పరామర్శించారు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
