రేపటి నుంచి అమూల్‌, మదర్‌ డెయిరీ పాలు లీటర్‌కు రూ.2 పెంపు

గోల్డ్‌, తాజా, శక్తి మిల్క్‌పై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్‌ బ్రాండ్‌పై పాలు విక్రయించే గుజరాత్‌ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జిమెమ్‌ఎమ్‌ఎఫ్‌) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా మదర్‌ డెయిరీ సైతం పాల ధరను పెంచింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు పేర్కొంది. పాలసేకరణ, ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అముల్‌, మదర్‌ డెయిరీలు ప్రకటించాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. మార్చిలోనూ మదర్‌ డెయిరీ లీటర్‌కు రూ.2 చొప్పున పెంచింది. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో రోజుకు 30 లక్షల లీటర్లకు పైగా పాలను మదర్‌ డెయిరీ విక్రయిస్తోంది.
అయితే, సగటు ఆహార పదార్థాల ద్రవ్యోల్బణంతో పోలిస్తే లీటర్‌కు రూ.2 పెంపు (4శాతం) తక్కువేనని (జిమెమ్‌ఎమ్‌ఎఫ్‌) ఫెడరేషన్‌ తెలిపింది.