మహాశివరాత్రి.. ఈ ఆలయంలో జోలెపట్టి వేడుకుంటే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి!

మహాశివరాత్రి.. ఈ ఆలయంలో జోలెపట్టి వేడుకుంటే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి!

భారత దేశంలో రెండు ప్రదేశాల్లో మాత్రమే పశ్చిమాభిముఖంగా వెలసిన శివ లింగాలు ఉన్నాయి. అది ఒకటి వారణాసిలోని విశ్వేశ్వరుడి ఆలయం కాగా, మరొకటి తెలంగాణలో ఉండటం మన అదృష్టం. కరీంనగర్ జిల్లా మంథనిలోని బిక్షేశ్వర స్వామి ఆలయంలో శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయంలో ద్వారపాలకునిగా హనుమంతుడు ఉండటం మరో విశేషం. ఇక్కడ బిక్షేశ్వరునికి అభిషేకం చేసి, తమ జోలె పట్టి బిక్ష వేడుకుంటే ఎంతటి కష్టాలైన తొలిగిపోతాయి. ఏటా పలువురు ఆధ్యాత్మిక గురువులు ఎందరో ప్రముఖులు ఈ స్వామి సేవలో తరిస్తారు.