తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నవంబర్ 2న కౌంటింగ్ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.
షెడ్యూల్ వివరాలు..
► అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల
► నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8
► అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన
► నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13
► అక్టోబర్ 30వ తేదీన పోలింగ్
► నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.