మనోళ్ల ఫొటోషాప్ టాలెంట్కు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ ఫిదా అయ్యారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఇవాంకా ట్రంప్తో తాజ్ మహల్ వద్ద తాను ఫొటో దిగినట్టుగా మార్ఫింగ్ చేసిన ఫొటోలను ప్రముఖ గాయకుడు దిల్జీత్ దొసాంజ్ ట్విట్టర్లో షేర్ చేశారు. తన భార్యతో కలిసి దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసిన ఆయన.. ఇవాంకా కాళ్లపై తను కాళ్లు వేసినట్టుగా ‘నేను, ఇవాంకా’ అని సరదాగా ట్వీట్ చేశారు. ఈ ఫొటో పట్ల ఇవాంకా సానుకూలంగా స్పందించారు. ‘‘నన్ను అద్భుతమైన తాజ్ మహల్ వద్దకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు దల్జీత్ దోసాంజ్’’ అని సరదాగా బదులిచ్చారు. తాజ్ మహల్ను వీక్షించడం అద్భుతమైన అనుభవమని.. ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.
దల్జీత్ ట్వీట్కు స్పందనగా.. ఆదిత్య చౌదరి అనే జర్నలిస్టు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలను ట్వీట్ చేశారు. ఓ యువకుడు ఇవాంకాను సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నట్టుగా మార్ఫింగ్ చేయగా.. మరో యువకుడు తాజ్ మహల్ ముందు ఇవాంకా భుజంపై చేయి వేసినట్టుగా మార్ఫింగ్ చేశారు. ఈ ట్వీట్కు కూడా ఇవాంకా బదులిచ్చారు.