జగన్‌ను కలిసిన హాకీ క్రీడాకారిణి రజని

భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి, గోల్ కీపర్ రజని బుధవారం తాడేపల్లిలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన తల్లిదండ్రులతలో కలసి ఆమె సీఎం జగన్ ను కలిశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్ హాకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ఘనత సాధించి. రజని స్వగ్రామం తిరుపతి సమీపంలోని చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం గ్రామం. భారత్ తరపున 110 అంతర్జాతీయ హాకీ మ్యాచులలో రజనీ గోల్ కీపర్ గా ప్రాతినిధ్యం వహించారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ తోపాటు.. తాజాగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లోనూ రజని పాల్గొన్నారు. ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్లు తిరుగులేని పోరాటం చేసి చరిత్రలో తొలిసారి సెమీ ఫైనల్స్ వరకు వెళ్లారు. కానీ ఆ మ్యాచ్‌లో ఓడిపోయారు. బ్యాంజ్ మెడల్ గెలిచే అవకాశం రాగా.. ఆ మ్యాచ్‌లోనూ పోరాడి బ్రిటన్‌పై కేవలం ఒక్క గోల్ తేడాతో ఓటమిని చవిచూశారు. దేశ చరిత్రలోనే తొలిసారి ఒలింపిక్స్‌లో మహిళా హాకీ టీమ్‌ను అక్కడి వరకూ తీసుకెళ్లి రికార్డు సృష్టించడంపై దేశమంతా గర్వించిందని ప్రధాని మోడీ సహా అన్ని రాష్ట్రాల సీఎంలు మెచ్చుకున్నారు.