టాలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణించారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో బాత్రూమ్లోనే కుప్పకూలిపోయారు. రాయలసీమ మాండలికంతో పలు సినిమాల్లో విలనిజం పండించారు. లాక్డౌన్ విధించిన నాటి నుండి షూటింగులు నిలిచిపోవడంతో గుంటూరులోని తన నివాసంలో ఉంటున్నారు. సమరసింహా రెడ్డి , ‘జయం మనదేరా’ వంటి ఫ్యాక్షన్ సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మహేష్బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చివరిసారిగా కనింపించారు.