నిరాడంబరంగా మాజీ సీఎం కొడుకు పెళ్లి

నిరాడంబరంగా మాజీ సీఎం కొడుకు పెళ్లి

జేడీఎస్‌ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం(ఏప్రిల్ 17,2020) రామనగరకు సమీపంలోని కేతగానహళ్లిలో ఫాంహౌస్‌లో నిరాడంబరంగా జరుగుతోంది. గురువారం బెంగళూరులో వధువు, వరుడి నివాసంలో సందడి నెలకొంది. అంగరంగ వైభవంగా నిర్వహించాలని అనుకున్నా కరోనా లాక్‌డౌన్‌ అడ్డు వచ్చింది. పెళ్లికి తక్కువ సంఖ్యలో ఇరు కుటుంబాల పెద్దలు హాజరవుతున్నారు.