మహిళలకు ప్రతి దశలోను ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా.. మహిళా సాధికారతపై ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం.. మహిళా పక్షపాతి ప్రభుత్వమని తెలిపారు. మహిళల కోసం ఇన్ని పథకాలు తెచ్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. అదేవిధంగా.. మహిళల ఖాతాల్లోకి నగదు చేరేలా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.