బీజేపీని ఓడించే సత్తా టిఆర్‌ఎస్‌కే ఉంది: సీపీఐ చాడ

బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికే మా మద్దతని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియా ఎదుట ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. ”బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికే మా మద్దతు. ఉపఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదు. బీజేపీని ఓడించే సత్తా ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉంది. అందుకే ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం. ఇది మునుగోడుకే పరిమితం కాదు. భవిష్యత్‌లో కూడా టీఆర్‌ఎస్‌తో పని చేస్తాం. 2018 ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌, సీపీఐని ఇబ్బంది పెట్టింది. మాకు ఇచ్చిన మూడు సీట్లలో కూడా కాంగ్రెస్‌ పోటీ చేసింది. ఉత్తమ్‌ కుమార్‌ మమల్ని బాగా ఇబ్బంది పెట్టారు. మునుగోడు బహిరంగ సభకు రావాలని కేసీఆర్‌ ఆహ్వానించారు. అందుకే సీపీఐ నేతలు వెళ్తున్నారు అని తెలిపారు.