సుప్రీంకోర్టుకు నూతనంగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవలే సుప్రీంకోర్టుకు కొత్తగా న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర సర్కారు గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే జడ్జిలుగా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రవికుమార్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు.