‘రాధేశ్యామ్‌’కు ఓటీటీ నుంచి భారీ ఆఫర్‌..!

ప్రభాస్‌ నటించిన పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకఅష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. కరోనా నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లా ఈ చిత్రం కూడా వాయిదా పడొచ్చని ఊహాగానాలు వెల్లువెత్తగా.. చిత్రబఅందం వాటిని ఖండించింది. ఖరారు చేసిన తేదీకే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అయితే.. తాజాగా ఈ చిత్రానికి ఓటీటీ నుంచి భారీ ఆఫర్‌ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తిరిగి ఆంక్షల విధింపు మొదలైన విషయం తెలిసిందే. ఆ ప్రభావం థియేటర్లపై పడుతుండటంతో భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలకు వెనకడుగు వేస్తున్నాయి. ‘రాధేశ్యామ్‌’ మాత్రం జనవరి 14నే విడుదల అవుతోంది. కాగా.. ఆంక్షలు తీవ్రమైతే ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశముంది. ఇదే అదునుగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ.. ‘రాధేశ్యామ్‌’ చిత్రాన్ని నేరుగా తమ ప్లాట్‌ఫాంలో విడుదల చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ‘రాధేశ్యామ్‌’ హక్కుల కోసం చిత్ర నిర్మాతలకు రూ.350కోట్లు ఆఫర్‌ చేసిందట. అయితే, ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చిత్ర దర్శకుడికి లేదని తెలుస్తోంది.