ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేటి నుంచి రెండు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మే 11న చివరిసారిగా ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య వేగంగా పెరగడంతో మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులతో చర్చించేందుకు రెండు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
