పోలవరం ప్రాజెక్ట్‌లో మరో ముందడుగు

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వర్షాలు పెరుగుతున్నా, గోదావరికి వరద పెరిగినా పనులు ఆపకుండా కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి భారీ గేట్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం పూజలు నిర్వహించి.. మంగళవారం గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ మొదలైంది. ఈ హైడ్రాలిక్ పద్ధతిలో గేట్ల వల్ల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది.

పోలవరంకు ఉన్న మొత్తం 48 గేట్లకు సంబంధించిన గడ్డర్ల బిగింపు పని 45-46 బ్లాకులోని పిల్లర్ల మీద మొదటి గడ్డర్‌ను అమర్చారు. ఒక్కో గడ్డర్‌ బరువు 62 టన్నులు కాగా.. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌ వేలోని 52 బ్లాక్స్‌కు సంబంధించిన పియర్స్‌ నిర్మాణం ముగింపు దశకు వచ్చింది. స్పిల్‌వే పియర్స్‌పై గడ్డర్లు ఏర్పాటు చేస్తే స్పిల్‌ ఛానల్‌ పనులలో దాదాపు అంత పూర్తి అయినట్లే. ప్రస్తుతం ఇవి 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి.