ప్ర‌భాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. మొత్తానికి ముహూర్తం పెట్టేశారు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పెట్టేసే కీలక ప్రకటన వచ్చింది. సాహూ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న తాజా సినిమా ఫస్ట్‌లుక్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసేశారు మేకర్స్. ప్ర‌భాస్ 20వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా చాలాకాలంగా చిత్రీకరణ జరుపుకుంటున్న క్రమంలో ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.

ఈ నేపథ్యంలో తాజాగా ప్ర‌భాస్ 20 ఫస్ట్‌లుక్ ఎప్పుడనేది చెప్పేశారు ప్రభాస్. ఈ మేరకు తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈ నెల (జులై) 10వ తేదీ ఉదయం 10 గంటలకు తన లేటెస్ట్ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నట్లు పేర్కొంటూ ఓ పిక్ షేర్ చేశారు ప్రభాస్. ఇది చూసి ఆనందపడుతున్న ఫ్యాన్స్ వెల్‌కమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1960 దశకం నాటి ప్రేమకథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రానికి ‘ఓ డియర్’ అనే పేరు పరిశీలనలో పెట్టారని టాక్.