దివంగత నేత సుష్మా స్వరాజ్కు కేంద్రం అరుదైన గౌరవన్ని కల్పించింది. దేశానికి ఆమె చేసిన సేవలకి గాను ప్రవాసీ భారతీయ కేంద్ర’కు గాను సుష్మా స్వరాజ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. ‘ప్రవాసీ భారత కేంద్ర’కు సుష్మా స్వరాజ్ భవన్గా మార్చడంతోపాటు ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ను సుష్మా స్వరాజ్ ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్గా మార్చాలని కేంద్రం నిర్ణయించినట్టుగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫిబ్రవరి 14న ఆమె తొలి జయంతి సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
