ప్రీ రిలీజ్‌కే భారీ లాభాలు తెచ్చిపెట్టిన ‘రాధేశ్యామ్‌’

‘రాధేశ్యామ్’ నిర్మాతలకు అప్పుడే భారీ లాభాలు ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో వచ్చేసినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రమిది. ఇటీవలే ఈ సినిమాను మార్చ్ 11వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్న మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుందట. ఈ మూవీ బడ్జెట్ రూ.250 కోట్ల రూపాయలని వార్తలు వచ్చాయి.