రెజీనా కసాండ్రా, నివేదా థామస్ కాంబినేషన్లో మహిళా ప్రాధాన్య చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాకిని-ఢాకిని టైటిల్ను ఫిక్స్ చేశారు. కొరియన్లో యాక్షన్ థ్రిల్లర్ ‘మిడ్నైట్ రన్నర్స్’కు రీమేక్గా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం కొరియన్ యాక్షన్ డైరెక్టర్ పర్యవేక్షణలో రెజీనా, నివేదా ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సిద్ధం చేస్తున్నారు.