ప్రభాస్ గురించి మనసులో మాట బయటపెట్టిన మిర్చి హీరోయిన్

ప్రభాస్ , అనుష్క, రిచా గంగోపాధ్యాయ కలిసి నటించిన సినిమా ‘మిర్చి‌’. ఈ సినిమాను ప్రభాస్ అభిమానులెవరూ మర్చిపోలేరు. అందుకే 2013లో వచ్చిన ఈ సినిమాకు ఏడేళ్లు గడుస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఏదో ఓ సందర్భంలో మిర్చీ టాపిక్ తీసుకు వస్తూనే ఉంటారు. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించిన రిచా సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి చేసుకున్నాక తొలిసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఆమెను ప్రభాస్ అభిమానులు చుట్టుముట్టారు.

తాజాగా ‘మిర్చి’ నటి రిచా గంగోపాధ్యాయ ఓ ట్వీట్‌ చేశారు. సంవత్సరంలో మొదటి త్రైమాసికం పూర్తయిందని.. ఆనందంగా గడపాల్సిన రోజులు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. ‘ఇలాంటి కష్ట సమయంలో (కరోనాను ఉద్దేశిస్తూ) మిమ్మల్ని మీరు రీఛార్జ్‌ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు’ అని ఫాలోవర్స్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్‌.. ‘మేడమ్‌ ప్రభాస్‌ గురించి ఒక్కమాట చెప్పండి. మానస (‘మిర్చి’లో పాత్ర) మీరు సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నా’ అని కామెంట్‌ చేశారు. దీనికి రిచా స్పందిస్తూ.. ‘ప్రభాస్‌ నిజంగా ఓ అద్భుతమైన వ్యక్తి. చాలా వినయంగా ఉంటారు. నాకిష్టమైన సహ నటుల్లో ఆయనొకరు’ అని చెప్పారు. దీంతో మరో నెటిజన్‌ కూడా.. ‘ప్రభాస్‌ గురించి ఒక్క మాట చెప్పండి?’ అని అడిగారు. ‘మీరు ‘వన్‌ వర్డ్‌’ ఎన్నిసార్లు అడుగుతారు.. నేను ఇప్పటికే మీకు చెప్పాను..’ అని నవ్వుతూ రిచా సమాధానం ఇచ్చారు. ‘మా వాళ్లకి ప్రభాస్‌ అంటే పిచ్చిలే అక్క.. పట్టించుకోవద్దు..’ అని మరో ఫాలోవర్‌ రిచా ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. దీనికి రిచా మళ్లీ రిప్లై ఇస్తూ.. ‘నాకు తెలుసు..’ అని ట్వీట్ చేశారు.