ఎన్టీఆర్, రామ్చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)’. ఈ ఏడాది దసరా సందర్భంగా సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘దోస్తీ..’ అంటూ సాగే తొలి పాటను ఫ్రెండ్షిప్ డేను పురస్కరించుకుని ఆగస్ట్ 1న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను ఐదు భాషల్లో హేమచంద్ర, అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ యేసుదాస్, యాజిన్ నజీర్ ఆలపించారు. సముద్రఖని, అజయ్ దేవగణ్, ఆలియా భట్, రే స్టీవెన్ సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడి వంటి బాలీవుడ్, హాలీవుడ్ తారలతో ఈ సినిమా తెరకెక్కుతోంది.