ఆడవాళ్లు మీకు జోహార్లు

డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఇందులో శర్వానంద్ జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ఫస్ట్‌లుక్‌లు సినిమాకు మంచి పాజిటివ్‌ బజ్‌ను తీసుకొచ్చాయి. ఇందులో ఖుష్బు, రాధిక శరత్‌ కుమార్‌ వంటి సీనియర్‌ నటీమణులు నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్‏లోని శిల్పా కళా వేదికలో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఆదివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.