వలస కార్మికులు వంటి వారికి ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ వీరి కోసం త్వరలోనే రెంటల్ హౌసింగ్ స్కీమ్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. విద్యార్థులు కూడా ఈ పథకం వల్ల ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంది.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రెంటల్ హౌసింగ్ స్కీమ్ ద్వారా తక్కువ అద్దెకే రూమ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇంటి అద్దె రూ.1,000 నుంచి ప్రారంభం కావొచ్చు. గరిష్టంగా రూ.3,000 వరకు ఉండొచ్చు. అయితే ఈ రెంట్ అంశంపై అంతిమ నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే. ఇప్పటికి అయితే అధికారికంగా ఈ విషయం వెల్లడికాలేదు. హౌసింగ్ మినిస్ట్రీ ఇప్పటికే ఈ స్కీమ్ కోసం తొలి విడత కింద రూ.700 కోట్లను కేటాయించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 14న ఈ స్కీమ్కు సంబంధించి ప్రకటన చేశారు. యూపీఏ ప్రభుత్వం కూడా రాజీవ్ ఆవాస్ యోజన, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ అనే రెండు స్కీమ్ను అందించేది. వీటి స్థానంలో కొత్త స్కీమ్ను తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం యోచిస్తోంది.