రాష్ట్రంలో మతపరమైన వివాదాలు సృష్టించి శాంతి భద్రతల విఘాతానికి కొన్ని శక్తులు ప్రయత్నించాయని, ఇటీవల కొన్ని ఘటనలు జరిగాయని, దానిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకల సందర్భంగా జెండాను ఆవిష్కరించిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజనుద్దేశించి ప్రసంగించారు. పభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణను కీలకంగా భావిస్తోందని, ప్రాంతీయ సమానతల కోసం 3 రాజధానులు అవసరమని గుర్తించిందని అన్నారు. విశాఖను పాలనా రాజధానిగానూ, అమరావతిని శాసన రాజధానిగానూ, కర్నూలును న్యాయ ...
Read More »Tag Archives: ap 3 capitals
గవర్నర్ ముందుకు ‘మూడు రాజధానుల బిల్లులు’
‘సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు’లను గవర్నర్ ఆమోదానికి ఏపీ ప్రభుత్వం శనివారం పంపించింది. శాసనమండలిలో రెండోసారి పెట్టి నెల రోజులు గడిచినందున నిబంధనల ప్రకారం అసెంబ్లీ అధికారులు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 క్లాజ్ 2 ప్రకారం రెండోసారి బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత ఆటోమెటిక్గా ఆమోదించినట్టుగా పరిగణిస్తూ గవర్నర్ ఆమోదం కోసం రెండు బిల్లులను అసెంబ్లీ అధికారులు పంపించారు.
Read More »