కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా, ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా ఎఐకెఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో రైతుగర్జన ర్యాలీ సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమైంది. వివిధప్రాంతాల నుండి ట్రాక్టర్లలో రైతులు, రైతుసంఘంనాయకులు నగరంలోని పడవలరేవు బిఆర్టిఎస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. అనంతరం ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. మోటారు సైకిళ్లపై కూడా ప్రజాసంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రైతుసంఘం రాష్ట్ర నాయకులు వి.కృష్ణయ్య, సిఐటియు రాష్ట్ర నాయకులు ముజఫర్ అహ్మద్, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, తదతరులు ర్యాలీ అగ్రభాగంలో ...
Read More »