పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతీ సంవత్సరం అక్టోబరు 21 న నిర్వహిస్తామని ఎపి డిజిపి గౌతం సవాంగ్ తెలిపారు. బుధవారం గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ… విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల సంస్మరణ జరుపుకుంటామన్నారు. సమాజ శ్రేయస్సు, భద్రత కోసం పోలీసులు పని చేస్తారని అన్నారు. చాలా బాధాకరమైన, క్లిష్టమైన సమయాలు కూడా పోలీసులకు ఉంటాయని చెప్పారు. రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు పని చేస్తారని అన్నారు. గత సంవత్సరం పోలీసులకు కోవిడ్ కారణంగా ఒక ఛాలెంజ్ ఎదురయ్యిందని, పోలీసులు కోవిడ్ ...
Read More »Tag Archives: ap police
ప్రతి మహిళా పోలీస్ ఓ స్టార్
ప్రతీ మహిళ పోలీస్ ఓ స్టార్ అని సినీనటి అనుష్క పేర్కొన్నారు. సైబరాబాద్ లో డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వాహనాలను అనుష్క ప్రారంభించారు. ఫ్రీ షీ షటిల్ బస్ లను అనుష్కతో పాటుగా, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ సజ్జానార్ కలిసి ప్రారంభించారు. అనంతరం ”షీ పాహి”, ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా.. తెలంగాణ పోలీస్ అధికారులతో పాటు ముఖ్య అతిథిగా అనుష్క హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అనుష్క మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఉన్న ప్రతి మహిళ ...
Read More »టెక్నాలజీ వినియోగంలో ఎపి పోలీస్ శాఖ నెంబర్ వన్.. 48 అవార్డులు కైవసం!
టెక్నాలజీ వినియోగంలో ఎపి పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో అత్యధికంగా 48 అవార్డులను దక్కించుకొని తొలి స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీస్ శాఖలలో టెక్నాలజీ వినియోగంలపై స్కొచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మొత్తం 84 జాతీయ అవార్డులను ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ 48, కేరళ 9, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ 4, తెలంగాణ, తమిళనాడు చెరో ఒకటి చొప్పున దక్కించుకున్నాయి. ఈ క్రమంలో ఎపి పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. టెక్నాలజీ ...
Read More »రాష్ట్రమంతటా ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం
అమరావతి : నేడు పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రమంతటా పోలీసు అమరవీరుల దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమరవీరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకొని వారికి ఘన నివాళులర్పిస్తున్నారు. విజయవాడ : విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్ రెడ్డి హాజరయ్యారు. అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎపి పోలీస్ శాఖ ప్రచురించిన అమరవీరుల చరిత్ర పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. దేశ రక్షణ, ప్రజా రక్షణ ...
Read More »పోలీసులపై ప్రశంసలు కురిపించిన సజ్జల రామకృష్ణ రెడ్డి
ప్రపంచానికి కష్టకాలం వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనాకు పూర్తి స్థాయి మందు రాలేదని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మనకున్న వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామన్నారు. మిగిలిన రాష్ట్రాలకంటే మన దగ్గర కొంత మెరుగ్గా ఉందని, పోలీసులు సైనికుల్లాగ పనిచేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పోలీసులకు శానిటైజర్లు, మాస్కులను బుధవారం సజ్జల పంపిణీ చేశారు.
Read More »