భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్( యుయు లలిత్) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవనలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, నవంబర్ 8 వరకు మాత్రమే అనగా కేవలం 74 రోజుల మాత్రమే సిజెఐగా ఉంటారు. ఆ సమయానికి ఆయనకు 65 ఏళ్లు నిండనున్నాయి. ఆ తర్వాత సీనియార్టీ జాబితాలో ఉన్న జస్టిస్ డివై చంద్రచూడ్ నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ...
Read More »Tag Archives: breaking news
ఎడిటర్ క్రీడలు రెజ్లింగ్లో అత్యధిక పతకాలు
బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు రెజ్లింగ్ విభాగంలో అత్యధికంగా 12 పతకాలు వచ్చాయి. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్లో 10 పతకాలు వచ్చాయి. 210మంది అథ్లెట్లతో భారీ బృందం ఇంగ్లండ్కు వెళ్తే 22 పతకాలు ఈ రెండు ఈవెంట్ల నుంచే వచ్చాయి. ఈ క్రీడల్లో భారత్ 22స్వర్ణ, 16రజత, 23కాంస్యాలతో సహా మొత్తం 61పతకాలతో నాల్గో స్థానంలో నిలిచింది. షూటింగ్కు ఈసారి చోటు దక్కకపోవడంతో టాప్-5లో నిలవడం కష్టమేనని భావించినా.. ఆ మార్క్కు చేరుకోగలిగాం. ఈసారి కూడా స్వర్ణ పతకాల వేటను ...
Read More »సిబిఐ దాడులు చట్టవిరుద్ధమంటూ స్పీకర్కు కార్తి చిదంబరం లేఖ
వీసా కుంభకోణం కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపి కార్తి చిదంబరం శుక్రవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ ప్రత్యేక హక్కుని సిబిఐ అధికారులు స్పష్టంగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఒకదాని తర్వాత మరొకటి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ సమస్య పార్లమెంట్ సభ్యునిగా తన హక్కులు, అధికారాలకు సంబంధించినదని, ఈ అత్యవసరమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి బాధపడుతున్నానని లేఖలో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ...
Read More »ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపారు. మాజీ గవర్నర్ నజీబ్ జంగ్ అనంతరం 2016 డిసెంబర్ 31న లెఫ్టినెంట్ గవర్నర్గా బైజల్ బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఐదున్నరేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో వివాదంతో బైజల్ పలుసార్లు వార్తల్లో నిలిచారు.
Read More »మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్ల కుమారుడు మృతి
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందారు. పుట్టుకతోనే జైన్ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం జైన్ నాదేళ్ల సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్కు ఈమెయిల్ ద్వారా వెల్లడించింది. సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది.
Read More »ఐదు రాష్ట్రాల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం (ECI) శనివారం గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ శాసనసభలకు సాధారణ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండగా.. మొత్తం 690 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి (పంజాబ్ 117, గోవా 40, మణిపూర్ 60, ఉత్తర్ ప్రదేశ్ 403, ఉత్తరాఖండ్ 70). ఈ ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ ...
Read More »సుమారు 13 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్ వైరస్
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన సరికొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్పై భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే 12 దేశాలకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణీకుల నుండి ఈ వైరస్ వచ్చినట్లు తెలుస్తోంది. కఠినమైన ప్రయాణ నిబంధనలు ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళనకరం. మాలావి రోడ్ నుండి టెల్ అవీవ్కు బస్సులో వచ్చిన ఓ ప్రయాణీకుడి ద్వారా ఓ కేసు వచ్చినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది. మరోవైపు కొత్త వైరస్ ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ...
Read More »అమిత్షాను కలిసిన యుపి మంత్రి అజయ్ మిశ్రా
యుపి హోంశాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా బుధవారం హోంమంత్రి అమిత్షాతో సమావేశమయ్యారు. లఖింపూర్ ఖేర్ జిల్లాలో రైతులను కారుతో తొక్కించిన ఘటనలో రైతులు సహా ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైనప్పటికీ ఇప్పటివరకు యుపి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోలేదు. రైతులను తొక్కించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తన కుమారుడు ఆ ప్రాంతంలో లేడంటూ అజయ్ మిశ్రా బుకాయిస్తున్నారు.
Read More »సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి
సుప్రీంకోర్టుకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సహా 9 మందిని నియమించాలంటూ సుప్రీం కొలీజియం చేసిన సిఫారసులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ నియామకాలపై నోటిఫికేషన్లు కేంద్ర న్యాయశాఖ గురువారం జారీ చేసింది. ఈ నియమాకాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు చెందిన పీఎస్ నరసింహా న్యాయవాది నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులవుతున్నారు. ఇలా గతంలో 8 మంది న్యాయవాదులు నేరుగా సుప్రీంకోర్టు జడ్జిలయ్యారు. తాజాగా నియమితులైన నరసింహా అయోధ్య కేసులాంటి పలు సంచలన కేసుల్లో వాదించారు. ఈయనతోపాటు.. వయసు రీత్యా సీనియారిటీ ప్రకారం జస్టిస్ ...
Read More »మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కేబినెట్లో కమిటీల్లో కీలక మార్పులు
ఇటీవల కేంద్ర కేబినెట్ విస్తరణ చేపట్టిన మోడీ ప్రభుత్వం క్యాబినెట్ కమిటీలను కూడా పునర్వ్యవస్థీకరించింది. మంత్రులు భూపిందర్ యాదవ్, సర్బానంద్ సోనోవాల్, మన్సుఖ్ మాండవీయ, గిరిరాజ్ సింగ్, స్మృతి ఇరానీలకు రాజకీయాలకు సంబంధించిన అన్ని కీలక కేబినెట్ కమిటీల్లోనూ స్థానం కల్పించింది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్లకు మొదటి సారి చోటు దక్కింది. గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా కూడా ఈ కమిటీలో ఉన్నారు. రవిశంకర్ ప్రాసద్ ...
Read More »