వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారు అని సీఎం జగన్ తెలిపారు. గుంటూరు జిల్లా ఫిరంగీపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. లంచంలేని వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల లక్ష్యం అని తెలిపారు. జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి. టీడీపీని అధికారంలోకి దింపడానికి జన్మభూమి కమిటీలే కారణం అని తెలిపారు సీఎం జగన్. గత పాలనకు, మన పాలనకు ఒక్కసారి తేడా గమనించండి. ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ ...
Read More »Tag Archives: cm jagan
జగన్ కు ఇచ్చిన మాట నెరవేర్చిన ముకేశ్ అంబానీ
ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. గతంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న పరస్పర అవగాహన ఒప్పందాల మేరకు ఈ పెట్టుబడులను ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు కూడా ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆయా కంపెనీల పెట్టుబడుల విలువ మొత్తం రూ.4,883కోట్లు అని మంత్రి అమర్నాథ్ తెలిపారు.
Read More »ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి.. వివాహా వేడుకకు సీఎం జగన్..
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహా వేడుకకు సీఎం శ్రీ వైఎస్ జగన్ హాజరైయ్యారు. కింగ్స్ ప్యాలెస్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వరుడు పవన్ కళ్యాణ్ రెడ్డి, వధువు కీర్తన రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపి ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.
Read More »వలంటీర్లకు గుడ్ న్యూస్..
సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించనుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ప్రభుత్వం ఈ ఏడాది నగదు పురస్కారాలను భారీగా పెంచింది. ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి సేవావజ్ర అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నగదు ...
Read More »రేపు కర్నూలు, గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఈ నెల 15వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూలు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరుకానున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూలు చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడ బళ్ళారి రోడ్లోని ఫంక్షన్ హాల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.40 ...
Read More »ఏపీకి భారీ పెట్టుబడులు.. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుడుతున్నారు. రిలయన్స్ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్తోపాటు పలు సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంగా సుమారు రూ.4,833 కోట్ల పెట్టుబడులు రానుండగా కొత్తగా 4,046 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
Read More »సీఎం జగన్ ని కలిసిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని
ప్రకాశం జిల్లా ఒంగోలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు.
Read More »వాలంటీర్లకు గుడ్యూస్.. త్వరలో రూ.30వేలు
వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మండలానికి ఐదుగురు/ మున్సిపాలిటీలో 10 మంది వాలంటీర్లకు సేవారత్న కింద రూ.20వేలు, నియోజకవర్గంలో ఐదుగురికి సేవా వజ్ర కింద రూ.30వేలు, సేవా మిత్ర కింద మిగతా వారికి రూ. 10వేలు ఇస్తారు. వాలంటీర్ల హాజరు, పెన్షన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
Read More »బీటీ ప్రభుత్వ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..!
మదనపల్లెకు మహర్దశ పట్టింది. రాయలసీమలో చారిత్రక నేపథ్యం కలిగిన బిసెంట్ థియోసాఫికల్ ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వ పరం చేయాలన్న పట్టణ ప్రజల ఆకాంక్షను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాకారం చేసింది. అంతే కాకుండా, ఎన్నికల సమయంలో ఎంపీ మిథున్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అనిబిసెంట్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ తాజా గా జీవో విడుదల చేసింది. దీంతో పట్టణ ప్రజలు, పూర్వవిద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పూర్వవిద్యా ర్థుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్. దేశాయ్ తిప్పారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ...
Read More »వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం..!
బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అలానే అభివృద్ధిని ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాలి అని అన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, సులభంగా గెలుస్తాంలే అని ధీమాను విడిచి పెట్టి కష్టపడి పనిచేయాలి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడం ఖాయం అన్నారు. కొన్ని ప్రాంతాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మధ్య ఉన్న విభేదాలు విడిచి పార్టీ గెలుపు కోసం ...
Read More »