Tag Archives: congress

ఇంకా తానే ముఖ్యమంత్రిని అని కేసీఆర్ అనుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

తెలంగాణకు ఇంకా తానే ముఖ్యమంత్రిని అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్ నుంచి నీలం మధు గెలవాలన్నారు. తనతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. అసలు ...

Read More »

షర్మిలకు ఈసీ నోటీసులు

APPCC చీఫ్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యను ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Read More »

ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ పూర్తి: సీఎం రేవంత్

ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని, వరికి రూ.500 బోనస్ ఇస్తామని CM రేవంత్ పునరుద్ఘాటించారు. మహబూబాబాద్ సభలో మాట్లాడుతూ ‘అయ్య పేరు, తాత పేరు చెప్పుకొని, ఎవరి కాల్లో పట్టుకొని మేము రాజకీయాల్లోకి రాలేదు. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నువ్వు కాదు, ఎవరొచ్చినా పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రజాపాలన అందిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు.

Read More »

బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు ప్రకాశ్ గౌడ్ కలిశారు. తన అనుచరులతో కలిసి ఈరోజో, రేపో కాంగ్రెస్ లో చేరుతానని రేవంత్ కు ప్రకాశ్ గౌడ్ తెలిపారు. రేవంత్ సమక్షంలోనే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

Read More »

నేటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఉదయం మహబూబ్నగర్లో వంశీచంద్ రెడ్డి నామినేషన్కు హాజరై సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్కు హాజరైన అనంతరం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈనెల 21న భువనగిరి, 22న ఆదిలాబాద్, 23న నాగర్కర్నూల్, 24న జహీరాబాద్, వరంగల్ లో పర్యటించనున్నారు.

Read More »

రేపటి నుంచి రేవంత్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదిగో!

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కేరళ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రేపు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడతారు. రేపు సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ...

Read More »

పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన కడియం శ్రీహరి

జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డిపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఆయన వందలకోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ వద్ద రూ.104 కోట్ల కమిషన్ తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని తాను యూనివర్సిటీని, మెడికల్ కాలేజీని తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ...

Read More »

ఎన్నికల తరువాత గల్ఫ్ పాలసీ తీసుకొస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ లోపు గల్ఫర్ కార్మికుల కోసం ప్రణాళిక రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గల్ఫ్ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల తరువాత గల్ఫ్ పాలసీ తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధి పై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ఆ కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ గల్ఫ్, ఓవర్సిస్ వర్కర్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయించామన్నారు. కార్మికుల సహాయార్థం ప్రజా భవన్ లో ప్రత్యేక కార్యాలయం ...

Read More »

రూ.2లక్షల రుణమాఫీ.. మంత్రి కీలక విజ్ఞప్తి

రూ.2లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని.. అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకులను కోరారు. CM, డిప్యూటీ CM, అధికారులతో చర్చించి రుణమాఫీ చేస్తామన్నారు. అటు రైతుభరోసా సాయం కోసం ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించి, సొమ్ము అందిస్తామన్నారు. ఇక వానాకాలం సీజను సంబంధించి పంటలకు అవసరమైన విత్తన సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Read More »

KCRపై కడియం సంచలన వ్యాఖ్యలు

ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌పై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఏదో ఒక కంపెనీలో పనిచేసే కార్మికులుగా చూస్తున్నారే తప్పా.. అందరికీ పార్ట్ నర్స్ అనే ఫీలింగ్ పార్టీ ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. తమకు ఎన్నడూ పార్టీలో ఓనర్ షిప్ రాలేదన్నారు. ఓనర్ షిప్ లేని పార్టీలో మనసు పెట్టి పనిచేయడం కష్టమవుతుందన్నారు. కేసీఆర్ మీకు ఏం తెలుసు అన్నట్లుగా తమ అభిప్రాయాలను ...

Read More »