ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ (కోవిడ్-19)పై యుద్ధాన్ని గెలవచ్చని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఈ మేరకు వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలను పాటించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన ఏపీ రాజ్భవన్లో మాట్లాడుతూ.. ప్రజలు ఇంట్లో ఉండాలని, ప్రయాణాలకు దూరంగా ఉండటం మేలని సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే మీ చేతులను తరచూ హ్యాండ్ శానిటైజర్లతో కడగాలని తెలిపారు. ఫేస్ మాస్క్లతో ముఖాన్ని కప్పుకోవాలని, చేతితో తాకిన ఉపరితలాలను శుభ్రపరచాలని పేర్కొన్నారు సామాజిక ...
Read More »Tag Archives: corona virus
రాజస్థాన్లో కరోనాతో ఒకరు మృతి
కరోనా వైరస్ బారిన పడిన ఇటాలియన్ పర్యాటకుడు రాజస్థాన్లోని జైపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భారత్లో తొలిగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఈ ఇటాలియన్ పర్యాటకుడు ఒకరు. ఇదిలా ఉంటే.. శుక్రవారం లక్నోలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పంజాబ్లోని మొహాలీలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఉత్తరాఖండ్లో ఇద్దరు ఐఎఫ్ఎస్ ట్రైనీస్ కరోనా బారిన పడినట్లు తెలిసింది. . మొత్తం మీద.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారత్లో ఇప్పటివరకూ 195కు చేరుకుంది.
Read More »22నుంచి నుంచి అంతర్జాతీయ విమాన సేవలు రద్దు
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 22వ తేదీనుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రైళ్లు, విమానాల్లో రాయితీ ప్రయాణాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Read More »కరోనాపై నేడు జగన్ వీడియో కాన్ఫరెన్స్
కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా నివారణలో భాగంగా కలెక్టర్లతో జగన్ మాట్లాడనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. కాగా కాన్ఫరెన్స్ అనంతరం జగన్ మీడియా మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది.కాగా.. కరోనా వైరస్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో ధైర్యాన్ని నింపాలే తప్ప భయాన్ని కాదని ఇదివరకే జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Read More »కరోనా పై కేఏ పాల్ ట్వీట్
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్లోనూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య శిభిరాలను ఏర్పాటు చేసి.. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని కొరకు అందుబాటులో ఉన్న ఆస్పత్రులను, మెడికల్ కాలేజీలను వైద్యులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు.ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ట్విటర్ వేదికగా తెలిపారు. దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా పెరుగుతోంది. కోవిడ్ బాధితులకు వైద్య సదుపాయం కల్పించేందుకు తమకు చెందిన సంగారెడ్డిలోని 300 ...
Read More »కరోనాకే వార్నింగ్ ఇచ్చిన రామ్గోపాల్ వర్మ
ఎప్పుడు కాంట్రవర్సీస్తో వార్తలలో నిలిచే రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు కాస్త ఫన్నీ ట్వీట్స్ కూడా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. తాజాగా ఆయన కరోనా వైరస్కే వార్నింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యాడు. వివరాలలోకి వెళితే ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్తో కంటిపై కునుకు లేకుండా కాలం గడుపుతున్న సంగతి తెలిసిందే. జనాలని ఇంతగా భయపెడుతున్న కరోనా.. మమ్మల్ని చంపితే నువ్వు చచ్చిపోతావు అన్న విషయాన్ని మరచిపోకు అని వర్మ .. కరోనాకే హెచ్చరికలు జారీ చేశాడు . డియర్ వైరస్, నువ్వు ...
Read More »హైటెక్ సిటీలో కరోనా కలకలం
రాష్ట్రంలో ప్రవేశించిన కోవిడ్-19(కరోనా వైరస్) ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలను సైతం గడగడలాడిస్తోంది. హైటెక్ సిటీలో కరోనా కలకలం రేగడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. రహేజా మైండ్ స్పేస్లో గల ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న టెకీ ఇటీవలే ఇటలీకి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో సదరు ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. వైరస్కు సంబంధించిన లక్షణాలు బయటపడటంతో సదరు బిల్డింగ్లోని సాఫ్ట్వేర్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులను ఇంటికి పంపించి.. వర్క్ ఫ్రం ...
Read More »కరోనా దెబ్బకు బయపడ్డ బాహుబలి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మాస్క్తో కనిపించాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో, ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. తర్వాతి షెడ్యూల్ కోసం మూవీ యూనిట్ యూరప్ బయల్దేరింది. ప్రభాస్ తెల్లవారు జామున ఎయిర్ పోర్టులో మాస్కుతో కనిపించడంతో తోటిప్రయాణికులు, సిబ్బంది గుర్తుపట్టి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభాస్ తన 21వ సినిమాను ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ...
Read More »కరోనా ఎఫెక్ట్.. ఒక్క రోజే 242 మంది మృతి
చైనాలో కరోనా మృత్యుకేళి తారా స్థాయికి చేరింది. హుబాయ్ ప్రావిన్సులో ఈ వైరస్ వల్ల బుధవారం ఒక్క రోజే 242 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఇంత ఎక్కువ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. బుధవారం రోజునే కొత్తగా సుమారు 15వేల కరోనా కేసులు కూడా నమోదు అయ్యాయి. కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగా 1310కి చేరుకున్నది. కరోనా వైరస్ బారిన పడి.. ఆ తర్వాత కోలుకున్న వారి సంఖ్య 3441కి చేరుకున్నది. ప్రస్తుతం ...
Read More »