Tag Archives: corona

ఎపి లో కర్ఫ్యూ

ఎపి లో ఎల్లుండి నుండి పాక్షిక కర్ఫ్యూ అమలుకానుంది. కరోనా నియంత్రణకుగాను ఎపి లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇకపై ఎల్లుండి (బుధవారం) నుండి పాక్షికంగా పగటి పూట కర్ఫ్యూ కూడా కొనసాగనుంది. కోవిడ్‌ నియంత్రణపై సిఎం జగన్‌ మంత్రులు, సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వివరించారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం జగన్‌ నిర్ణయించారని తెలిపారు. ఎపి లో ఉదయం 6 గంటల నుంచి ...

Read More »

నాలుగు లక్షలకు చేరువలో కరోనా కేసులు

 దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కొత్త కేసులు పెరగడమే కాకుండా.. అత్యధిక సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,86,452 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్త కోవిడ్‌ కేసుల సంఖ్య 1,8a7,62,976కు చేరింది. ఇక గురువారం ఒక్కరోజే 3,498 మంది కరోనాబారిన పడి మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 2,08,330కు చేరింది. అలాగే దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయానికి 31,70,228 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ...

Read More »

ఎపి ఇంటిలిజెన్స్‌ ఎస్‌పి రాంప్రసాద్‌ కరోనాతో మృతి

ఎపి ఇంటిలిజెన్స్‌ ఎస్‌పి రాంప్రసాద్‌ 10 రోజులుగా కరోనాతో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. పోలీస్‌ శాఖలో సమర్థవంతమైన అధికారిగా రాంప్రసాద్‌కు మంచి పేరు ఉంది. గతంలో విజయవాడ ట్రాఫిక్‌ ఎడిసిపి గా విధులను నిర్వర్తించారు. ప్రస్తుతం కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌లో నాన్‌ కేడర్‌ ఎస్‌పి గా ఉన్నారు.

Read More »

ప్రముఖ చిత్రకారుడు చంద్ర కరోనాతో కన్నుమూత

ప్రముఖ చిత్రకారుడు, రచయిత చంద్ర (74) కరోనాతో కన్నుమూశారు. గత మూడేళ్లుగా నరాలకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న చంద్ర కరోనా బారినపడటంతో సికింద్రాబాద్‌లోని మదర్‌ థెరిసా రీహాబిటేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. చంద్ర భౌతికకాయాన్ని బంజారాహిల్స్‌ శ్రీనగర్‌ కాలనీలోని నివాసానికి తరలించారు.

Read More »

చార్‌ధామ్‌ యాత్రను రద్దు చేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏటా జరిగే చార్‌ధామ్‌ యాత్రను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రద్దు చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్‌సింగ్‌ రావత్‌ గురువారం ప్రకటించారు. అలాగే ఆలయాల్లోకి భక్తులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కేవలం ఆ ఆలయాల్లోని పూజా కార్యక్రమాలు అర్చకులే నిర్వహిస్తారని ఆయన అన్నారు.ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి, గంగోత్రిలు ఈ నాలుగు ఆలయాలను చార్‌ధామ్‌లుగా పిలుస్తారు. ఈ నాలుగు ఆలయాల సందర్శన రీత్యా ప్రతిఏటా ...

Read More »

రెండు లక్షలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి ప్రాణాంతకంగా మారింది. రోజుకు వేలాది మందిని పొట్టనబెట్టుకుంటూ బెంబేలెత్తిస్తున్నది. గడచిన 24 గంటల్లో 3,293 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. దీంతో వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య రెండు లక్షలను దాటింది. తాజా మరణాలతో కరోనా మరణాల స్యం 2,01,187కు చేరింది. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 3,60,960 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267కు చేరాయి. బుధవారం ఉదయం నాటికి 29,78,709 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ...

Read More »

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ కరోనాతో మృతి

మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపి ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ (81) కరోనాతో మరణించారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ముంబైలోని కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కూతురు వర్షా గైక్వాడ్‌ ప్రస్తుతం మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ ముంబయి సౌత్‌ సెంట్రల్‌ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపిగా గెలుపొందారు. దేశంలోనే అతిపెద్ద మురికివాడ ఉన్న ముంబయిలోని ధారావి అసెంబ్లీకి 1985 నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు ...

Read More »

వచ్చే నెలలో 44 ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పుతాం : కేజ్రీవాల్‌

 ఢిల్లీలో కోవిడ్‌ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆక్సిజన్‌ కొరత ఏర్పడంతో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ సైతం అసహనం వ్యక్తం చేసిన సంగతి విదితమే. దీంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల నుండి ఆక్సిజన్‌ ట్యాంకర్లు, ప్లాంట్లను దిగుమతి చేసుకుంటోంది. దేశ రాజధానిలో వచ్చే నెలలో 44 ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం తెలిపారు. ఆక్సిజన్‌ ట్యాంకర్ల కొరత ఉందని, ఈ సమస్యను తగ్గించడానికి బ్యాంకాక్‌ నుండి 18 ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ...

Read More »

కరోనాపై భారత్‌కు ఫ్రాన్స్‌ సాయం….

కరోనా సునామితో అల్లాడుతున్న భారత్‌కు సాయమందించేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన మెటీరియల్‌ అందిస్తామని అమెరికా ప్రకటించగా..తాజాగా ఫ్రాన్స్‌ కూడా చేయూతనిస్తామని ప్రకటించింది. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవసరమైన ఆరోగ్య పరికరాలు, వెంటిలైటర్స్‌, లిక్విడ్‌ ఆక్సిజన్‌ కంటైనర్స్‌, ఆక్సిజన్‌ జనరేటర్లను పంపిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్‌ మాక్రాన్‌ మంగళవారం ప్రకటించారు. ఈ మహమ్మారిపై ఇరు దేశాలు కలిసి పోరాడి విజయం సాధిస్తాయని హిందీలో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘ కరోనా వైరస్‌కు ఇక ఎవరూ బాధితులు కారు. ...

Read More »

ఇంట్లోనూ మాస్క్‌ను ధరించాల్సిందే..

నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వికె.పాల్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో.. అనవసరంగా ఇళ్లలో నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లవద్దని అన్నారు. ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ అని తేలితే మిగతా వాళ్లంతా ఇంట్లోనూ మాస్కులు ధరించాలని సూచించారు. వాస్తవానికి అందరూ ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకుంటే మంచిదని వికె.పాల్‌ సలహా ఇచ్చారు. కరోనా సోకిన వ్యక్తి కచ్చితంగా మాస్క్‌ పెట్టుకోవాలని కోరారు. ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తులు కూడా ఒకచోట కూర్చున్నప్పుడు మాస్కులు పెట్టుకుంటే మంచిదని అన్నారు. కరోనా ...

Read More »