ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఈరోజు, రేపు ఢిల్లీలో ఉండనున్న సీఎం జగన్ ఈరాత్రి 9గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశంకానున్నారు. రాష్ట్ర సమస్యలతోపాటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, దిశ చట్టంపై అమిత్షాతో డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. అకాల వర్షాలు, వరదల వల్ల జరిగిన పంటనష్టం ...
Read More »Tag Archives: jagan delhi tour
నేడు మళ్లీ ఢిల్లీకి జగన్
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. విభజన హామీలు, తదితర అంశాలపై బుధవారం ప్రధాని మోడీతో ఆయన సమావేశమైన విషయం తెలిసిందే. విభజన హామీలతోపాటు మరికొన్ని అంశాలపై సిఎం సుదీర్ఘంగా చర్చించారు. ఇవే అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో శుక్రవారం భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన హామీల అంశం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఈ అంశాలపై అమిత్షాతో సిఎం చర్చించనున్నారు. దీంతోపాటు దిశ చట్టం గురించీ చర్చించే అవకాశం ఉంది.
Read More »రేపు మరోసారి ఢిల్లీ కి సీఎం జగన్
రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్. రేపు సాయంత్రం అమిత్షాతో జగన్ భేటీకానున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర వ్యవహారాలపై చర్చించారు. ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం ఈ భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు.
Read More »నేడు ప్రధానితో ఏపీ సీఎం జగన్ భేటీ
ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం సమావేశం కానున్నారు. ఢిల్లీలో సాయంత్రం 4.30 గంటలకు ఈ భేటీ ఉంటుంది. ఈ సందర్భంగా మూడు రాజధానుల నిర్ణయం, శాసనమండలి రద్దు అంశాలపై మోడీకి వివరణ ఇస్తారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం ఆలస్యమవుతోంది. దీనిపైనా ప్రధానితో చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
Read More »రేపు ఢిల్లీకి సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను సీఎం కలవనున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read More »