దేశంలో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం జగన్ అన్నారు. నెలరోజుల్లోనే టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్డీఎల్ ల్యాబ్ కూడా లేదని.. ఇప్పుడు 9 చోట్ల కరోనా టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 74,551 మందికి పరీక్షలు చేశామని సీఎం వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్డౌన్ అంశాల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సందేశమిచ్చారు. దేశంలో అత్యధికంగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ...
Read More »