కరోనా మహమ్మారి రోజురోజుకు రూపం మార్చుకుంటూ మరింత శక్తివంతంగా తయారవతుంది. తాజాగా డెల్టా వేరియంట్ వ్యాప్తి ప్రారంభమయ్యింది. ఇది మిగతా వాటికన్న చాలా రేట్లు ప్రమాదకరం అని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసి హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదయ్యింది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో డెల్టా ప్లస్ వేరియంట్ సోకి బుధవారం ఒక మహిళ మృతి చేందారు. మృతురాలి నుంచి తీసుకున్న నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా సదరు మహిళ కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ వల్లనే మృతి చెందినట్లు వైద్యులు ...
Read More »Tag Archives: latest news
జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాల్సిందే : సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్ మార్కుల అసెస్మెంట్ను పూర్తి చేసి, జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పది రోజుల్లోగా బోర్డులను మూల్యాంకన విధానాన్ని రూపొందించి కోర్టుకు తెలియజేయాలని సూచించింది. 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు విచారణ జరిపింది. అయితే, బోర్డులన్నింటికీ ఏకరూప మూల్యాంకన విధానం ఉండేలా ఆదేశాల ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతి బోర్డు స్వయంప్రతిపత్తి కలిగి ఉందని, అందువల్ల బోర్టులు తమ సొంత ...
Read More »రాష్ట్రీయం మండలి రద్దుపై వెనక్కి తగ్గేది లేదు
శాసనసమండలిని రద్దు చేయాలన్న తమ ప్రభుత్వ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మండలి రద్దు తీర్మానం అనేది ఎత్తుగడలో భాగంగా తమ ప్రభుత్వం చేయలేదన్నారు. మండలి వ్యవస్థ ఉండకూడదనేదే తమ ఉద్దేశ్యమమన్నారు. ప్రతిపక్షం శాసనమండలిని నవ్వలాటగా మార్చిందని, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని విమర్శించారు. గవర్నర్ కోటాలో మండలికి ఎంపికయిన అభ్యర్ధుల ప్రమాణస్వీకారం సందర్భంగా సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More »కూతురు స్క్రిప్ట్తో సినిమా
‘లూసిఫర్’ తో నిర్మాతగా మారిన మాలీవుడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మరో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. తన ఏడేళ్ల కూతురు అలంకృత రాసిన స్క్రిప్ట్ బేస్ చేసుకుని రెండో సినిమా తీయబోతున్నట్లు చెప్పారు. ‘తండ్రీ కొడుకులు అమెరికాలో నివసిస్తుంటారు. రెండో ప్రపంచయుద్ధం ప్రారంభం కావడంతో వారిద్దరిని రెప్యూజీ క్యాంప్కు తరలిస్తారు అధికారులు. అక్కడ రెండు సంవత్సరాల పాటు ఉన్న తండ్రీ కొడుకులు వార్ ముగియడంతో తిరిగి ఇంటికి వచ్చి సంతోషంగా జీవిస్తుంటారు’. ఇది కూతురు రాసిన ...
Read More »జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన జగన్
2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ను సిఎం జగన్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించామన్నారు. 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయని, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2.50 లక్షలకు పైగా నిరుద్యోగులను భాగస్వామ్యం చేశామని సిఎం ...
Read More »యూట్యూబ్లో ఇకపై ఆ యాడ్స్ కనిపించవు
ఫ్రీ మరియు ప్రీమియం ప్యాకేజీల ద్వారా వీడియో కంటెంట్ వినోదాన్ని అందిస్తున్న యూట్యూబ్ హర్షించదగ్గ నిర్ణయం తీసుకుంది. ఇకపై జూదం, మద్యం, రాజకీయాలకు సంబంధించిన యాడ్లను ప్రముఖంగా ప్రచురించకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్ 14న యూట్యూబ్ మస్ట్హెడ్ (యూట్యూబ్ టాప్ పేజీ) కంటెంట్కు ఉండాల్సిన అర్హతల జాబితాను రిలీజ్ చేసింది. గ్యాంబ్లింగ్, ఆల్కాహాల్, పాలిటిక్స్, డ్రగ్స్కు లింకు ఉన్న యాడ్లేవీ ఇకపై యూట్యూబ్ టాప్, హోం పేజీలో కనిపించవని ఆదివారం యూట్యూబ్ సంస్థ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. యూట్యూబ్ను ఓపెన్ చేయగానే ...
Read More »సెకండ్ వేవ్లో రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నష్టం
కరోనా సెకండ్ వేవ్ జీవనోపాధిని చిధ్రం చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి మసకబారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 2 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నెలవారీ బులెటిన్లో భాగంగా జూన్ వివరాలను వెల్లడించింది. ప్రాంతీయ-నిర్ధిష్ట నియంత్రణ చర్యలు, చిన్న గ్రామాలకు కూడా వైరస్ సోకడం వంటివి కారణాలుగా పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆశలు వ్యక్తమౌతున్నప్పటికీ సెకండ్ వేవ్తో ఇంకా భారత్ కుస్తీ పడుతూనే ఉందని ఆర్బిఐ అభిప్రాయపడింది. ప్రాథమికంగా దేశీయ డిమాండ్ను తీవ్రంగా ...
Read More »TRS ఎంపీ నామాకు ED సమన్లు
బ్యాంకు రుణాల మళ్లింపు వ్యవహారంలో తెరాస లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నామాతో పాటు మధుకాన్ కేసులో నిందితులందరికి ఇడి సమన్లు పంపింది. జాతీయరహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాల కోసం మళ్లించినట్లు మధుకాన్ గ్రూప్పై ఇడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ...
Read More »గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీకి సిద్ధం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ సిద్ధమేనని ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. సోమవారం అహ్మదాబాద్లోని నవ్రంగ్పురలో ఆప్ పార్టీ కార్యాలయాన్ని కేజ్రీవాల్ ప్రారంభించారు. కేజ్రీవాల్ సమక్షంలో ప్రముఖ పాత్రికేయుడు ఇసుదన్ గాద్వి ‘ఆప్’లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాల్లోనూ అప్ అభ్యర్థులు పోటీ చేస్తారని, అందుకు ఆప్ సిద్ధంగా ఉందని అన్నారు. కాగా, కేజ్రీవాల్ అహ్మదాబాద్ రావడం ఈ ...
Read More »ప్రధాని మోడికి సీఎం జగన్ లేఖ
రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే పక్కాగా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబందించిన కార్యక్రమం అధికారికంగా ప్రారంభించారు. ఇక ఇదిలా ఉంటే, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ లేఖలో వివరించారు. ఏపీలో 30లక్షల మందికి ...
Read More »