Tag Archives: latest news

చిత్తూరు జల్లికట్టులో 30 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన జల్లికట్టు కార్యక్రమంలో 30 మందికి పైగా గాయపడ్డారు. నిన్న చిత్తూరులో నిర్వహించిన జల్లికట్టు ఆట ‘పశువుల పండుగ’లో పొరుగున ఉన్న నెల్లూరు, కడప జిల్లాల నుంచి వచ్చినవారితోపాటు వందలాదిమంది పాల్గొన్నారు. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి, చంద్రగిరి మండల పరిధిలోని వార్షిక కార్యక్రమంలో 500 పైగా ఎద్దులు, వందలాది గ్రామస్థులు పాల్గొన్నారు. నివేదిక ప్రకారం… జల్లికట్టు వేడుకలో 30 మందికి పైగా గాయపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోని గుండుపల్లి మండలం ...

Read More »

అమెరికాలో కరోనా విశ్వరూపం

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విశ్వరూపం దాల్చింది. మహమ్మారి తీవ్రతతో అమెరికాలో ప్రతీ సెకన్‌కు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వైద్య నిపుణుల వివరాల ప్రకారం … అమెరికాలో ఒకే రోజు 14,49,005 మందికి వైరస్‌ సోకింది. వారం రోజుల సగటును పరిశీలిస్తే.. అమెరికాలో ప్రతీ సెకన్‌కు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 21,041,50 మంది వైరస్‌ బారినపడ్డారు. 4,608 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో.. మొత్తం కేసులు 311,019,858, మరణాలు 5,511,955 ...

Read More »

ఐదు రాష్ట్రాల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం (ECI) శనివారం గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ శాసనసభలకు సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండగా.. మొత్తం 690 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి (పంజాబ్ 117, గోవా 40, మణిపూర్ 60, ఉత్తర్ ప్రదేశ్ 403, ఉత్తరాఖండ్ 70). ఈ ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ ...

Read More »

హైదరాబాద్‌ లో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ప్రారంభం

దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం (ఐఎఎంసి) హైదరాబాద్‌లో ప్రారంభమయింది. నానక్‌రాంగూడ ఫొనిక్స్‌ వీకే టవర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సిజెఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రారంభించారు. వీరితో పాటు జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఈ సెంటర్‌ను సిజెఐ జస్టిస్‌ ఎన్‌వి రమణకు సిఎం కెసిఆర్‌ అప్పగించారు. ఇద్దరూ కలిసి ఐఎఎంసిలోని వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసినప్పటికీ, త్వరలో సొంత భవనం నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ హామీ ఇచ్చారు. ...

Read More »

బడ్జెట్‌లో వైద్యానికి ఎపిలో కేటాయింపు 6.6 శాతమే..!

వార్షిక బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి అవసరమైన కేటాయింపులు పెరగడంలేదు. బడ్జెట్‌ గణాంకాలలో గణనీయమైన పెరుగుదలను చూపిస్తున్నప్పటికీ, నిధుల విడుదల మాత్రం ఆశించినస్థాయిలో ఉండటంలేదు. బడ్జెట్‌లో కనీసం ఎనిమిది శాతాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఎపి 6.6 శాతం కేటాయించి దేశంలో ఎనిమిదో స్థానంగా ఉండటం గమనార్హం. రాష్ట్రాల బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్యశాఖ కేటాయింపులపై పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ సంస్థ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. 8 శాతం కేటాయింపును ...

Read More »

మొట్టమొదటిసారి మహిళా కానిస్టేబుల్‌కు వీక్లీ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అవార్డ్‌

జాతీయ రహదారిపై దొంగతనానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో తెగువ చూపిన మహిళా కానిస్టేబుల్‌ కు అవార్డును జిల్లా ఎస్పీ అందజేశారు. మహిళా కానిస్టేబుల్‌కు తేనీరు అందించి, ఆమె చూపిన తెగువకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కంచికచర్ల పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన దొంగతనం కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన కంచికచర్ల పోలీస్‌ స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌-1577 టీ శివకుమారి కి మంగళవారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఐపీఎస్‌ వీక్లీ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అవార్డును అందజేశారు. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి ...

Read More »

సుమారు 13 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్‌ వైరస్‌

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన సరికొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌పై భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే 12 దేశాలకు ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణీకుల నుండి ఈ వైరస్‌ వచ్చినట్లు తెలుస్తోంది. కఠినమైన ప్రయాణ నిబంధనలు ఉన్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి చెందడం ఆందోళనకరం. మాలావి రోడ్‌ నుండి టెల్‌ అవీవ్‌కు బస్సులో వచ్చిన ఓ ప్రయాణీకుడి ద్వారా ఓ కేసు వచ్చినట్లు ఇజ్రాయిల్‌ వెల్లడించింది. మరోవైపు కొత్త వైరస్‌ ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ...

Read More »

తెలుగు వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం

ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి చెన్నుపాటి జగదీశ్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని అత్యుత్తమ సైన్స్ అకాడమీల్లో ఒకటైన ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తదుపరి అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జగదీశ్  ప్రస్తుతం ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో భౌతికశాస్త్ర పరిశోధకుడిగా ఉన్నారు. నానో టెక్నాలజీలో నిపుణుడైన ఆయన మే 2022లో ఆస్ట్రేలియా అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

Read More »

శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా జకియాఖానమ్‌

 శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. కడప జిల్లా రాయచోటికి చెందిన వైసిపి ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా మాట్లాడుతూ మహిళల సంక్షేమ కోసం అనే పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని ఆమె కొనియాడారు. దేశానికే మన రాష్ట్రం ...

Read More »

మూడు రాజధానుల బిల్లు వెనక్కు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్‌ స్వయంగా హైకోర్టుకు తెలిపారు. ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశంలోనూ మూడు రాజధానులపైనే చర్చ జరిగింది. అయితే, మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందా లేదా తన వ్యూహం మార్చిందా అన్నదే అంతుపట్టడం లేదు. మూడు రాజధానులపై టెక్నికల్‌గా సమస్యల్ని పరిష్కరించి మళ్లీ బిల్లులు పెడతారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు చట్టాల్ని రద్దు చేస్తూ మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ...

Read More »