తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్లో విషం తాగి మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి ఆయన ఆర్యవైశ్య భవన్లో బస చేశారు. ఆయన భార్య ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. మారుతీరావు రూమ్ డోర్ తీయకపోవడంతో సిబ్బంది బలవంతంగా తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే ఆయన మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. ...
Read More »