భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి , ఏపీ మంత్రి రోజా, కేంద్ర మాజీ మంత్రులు, చిరంజీవి, పురందేశ్వరీ తదితర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం ...
Read More »Tag Archives: modi
ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం
ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్ తమిళసై, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే ఈ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన ఈ పర్యటనకు దూరంగా ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. జ్వరం తగ్గితే ముచ్చింతల్ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read More »ఎస్పివి ప్రతీకార రాజకీయాలు..వర్చువల్ సమావేశంలో మోడీ
అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్లో బిజెపిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓటర్లను ప్రేరేపిస్తుందని మండిపడ్డారు. యుపిలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు చాలా దూరంగా ఉందని ఎస్పి చెబుతోందని అన్నారు. ఫేక్ సమాజ్వాద్.. పేదల ప్రభుత్వం మధ్య ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. పేదలకు ఇళ్లు, వెనుకబడిన వర్గాలకు పథకాలు, మెడికల్ కాలేజీలు, ఎక్స్ప్రెస్వేల ద్వారా కనెక్టివిటీ, ముస్లిం మహిళలకు కార్యక్రమాలు, మహిళలకు సంబంధించి వివిధ పథకాలు గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఈ రోజుల్లో.. ప్రజలు చాలా కలలుగంటున్నారు. ...
Read More »అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో మోడీకి తొలిస్థానం
మోడీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన దేశాధినేతల్లో తొలి స్థానంలో నిలిచారు. 13 మంది దేశాధినేతలపై అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణకొరియా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాధినేతలపై ఈ సర్వే చేపట్టింది. అందులో మోడీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారు. ఇక ఈ జాబితాలో 43 శాతం రేటింగ్తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ...
Read More »వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో భేటీ కానున్నమోడీ
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తోంది భారత్.. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 100 కోట్ల మార్క్ను కూడా దాటేసిన సంగతి తెలిసిందే కాగా… వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ.. స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశం కానున్నారు.. దేశీయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న ఏడు వ్యాక్సిన్ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో భేటీ అవుతారు.. ఈ సమావేశానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, జైడస్ క్యాడిల్లా, ...
Read More »‘100 కోట్ల’ వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ
కోవిడ్-19 వ్యాక్సినేషన్లో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘భారత్ సరికొత్త చరిత్రను లిఖించాం. 130 కోట్ల మంది భారతీయుల సమిష్ట స్పూర్తి, భారత సైన్సు, ఎంటర్ ప్రైజ్ విజయాన్ని నేడు మనం చూస్తున్నాం. టీకా పంపిణీలో 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేసిన మన డాక్టర్లకు, నర్సులకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ ని ట్విట్ ...
Read More »సుప్రీంకోర్టు ఈమెయిల్స్లో ప్రధాని మోడీ యాడ్.. తొలగించాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం
వచ్చే ఏడాది 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను ప్రోత్సహించడానికి కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇది ఆరు నెలల క్రితం మొదలు పెట్టగా.. పెద్ద యెత్తున ప్రచారం చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుండి అడ్వకేట్లకు వస్తున్న ఈ మెయిల్స్లో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోడీ ఫోటోలతో కూడిన యాడ్స్ రావడం ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తోంది. ఈ మెయిల్స్లో ఆయన చిత్రాలు రావడాన్ని కొంత మంది సీనియర్ అడ్వకేట్లు ధ్రువీకరించారు. ఈ చర్య ...
Read More »అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్..త్వరలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమవుతున్న క్రమంలో ఆ దేశ పరిస్థితులపై చర్చించేందుకు గురువారం ఆల్ పార్టీ మీటింగ్ లేదా అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరియు అక్కడ చిక్కుకున్న భారతీయలను స్వదేశానికి సురక్షితంగా తరలించడం వంటి విషయాలను అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు వివరించాలని ప్రధాని మోదీ కోరినట్లు సోమవారం విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Read More »ఎర్రకోటపై జాతీయ జెండా ను ఎగురవేసిన నరేంద్ర మోదీ
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఎర్రకోటపై ప్రధాని హోదాలో 8వసారి ప్రధాని మోదీ జెండా ఎగరవేశారు.
Read More »మోడీ ‘బాధితుల’ జాబితాలో చేరిన యడియూరప్ప
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామాతో.. మోడీ సర్కార్పై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. మోడీ మరో బాధితుడు యడియూరప్ప అంటూ వ్యాఖ్యానించింది. రాజీనామా చేయాలంటూ మోడీ ఒత్తిడి తీసుకువచ్చిన బిజెపి సీనియర్ నేతల జాబితాలో యడియూరప్ప మరో బాధితుడుగా చేరాడని కాంగ్రెస్ పేర్కొంది. ముఖ్యమంత్రులు, బిజెపి ఎమ్మెల్యేలుగా కొనసాగాలంటే కేంద్రంలోని నిరంకుశ పాలకుల అనుమతి ఉండాల్సిందేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. అక్రమంగా, ఫిరాయింపు ద్వారా కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టిందని.. ఇది చట్టవిరుద్ధమని అన్నారు. కాంగ్రెస్ -జనతా దళ్ (సెక్యులర్) ...
Read More »