దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు లాక్డౌన్పై ఆయన కీలక నిర్ణయం ప్రకటించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్లో వెల్లడించింది. కాగా, శనివారం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మెజారిటీ రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించాలని కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒడిషా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు
Read More »Tag Archives: modi
రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న మోడీ క్యాబినెట్
మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఎంపీల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లలో ఈ కోత ఉంటుందంటూ ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ మేరకు 1954 చట్టాన్ని సవరించింది. అదే విధంగా, ఎంపీలకు ఇచ్చే లాడ్స్ (ఎంపీ లాడ్స్)ను (2020-21 , 2021-22) రద్దు చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ సోమవారంనాడు మీడియాకు ...
Read More »క్రీడా ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దానిని నివారించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగాల ప్రముఖులతో సమాలోచనలు జరుపుతున్నారు. దీనిలో భాగంగానే బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీతో ప్రధాని మోదీ వీడియా కన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గంగూలీతో పాటు టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్, పీవీ సింధు, దేశ వ్యాప్తంగా వివిధ క్రీడలకు సంబంధించిన 40 మంది ప్రముఖులతో ప్రధాని చర్చించారు. వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమంలో క్రీడాకారులను కూడా ...
Read More »తెలుగు లో ప్రధాని మోదీ ట్వీట్
ఉగాది పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది… ఈ ఏడాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో.. ముఖ్యంగా ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.
Read More »జాతినుద్దేసించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. కోవిడ్ -19 (కరోనా వైరస్) విస్తరిస్తున్న వైనం, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని జాతికి సందేశాన్ని ఇవ్వనున్నారు. కోవిడ్ -19కి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై మార్చి 24 (మంగళవారం) సాయంత్రం 8 గంటలకు ఆయన సందేశాన్ని ఇవ్వనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిపై ముఖ్యమైన విషయాలను పంచుకుంటాను అంటూ ప్రధాని మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటనను సీరియస్ తీసుకోవడం లేదంటూ ప్రధాని ...
Read More »బిజెపికి ప్రముఖ నటి సుభద్రా ముఖర్జీ గుడ్ బై
ప్రముఖ బెంగాలీ నటి, సుభద్రా ముఖర్జీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఢిల్లీ అల్లర్లకు కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోనందుకు నిరసనగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాగూర్ వంటి నేతలున్న బిజెపిలో తాను కొనసాగలేనని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాను ఎన్నో ”ఆశలతో” బిజెపి లో చేరాననీ.. కానీ ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె అన్నారు. బిజెపి తన సిద్ధాంతాల నుంచి ...
Read More »జగన్ పై జరిగే అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టిన బీజేపీ నేత.!
మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ లేని చెత్త అంతా ఇక్కడే ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.ముఖ్యంగా మీడియా సంస్థలు అయితే మరీ దారుణంగా తయారయ్యాయి.దీనితో పలు మీడియా ఛానెల్స్ నే రాష్ట్రంలో బ్యాన్ చేయించుకునే స్థాయికి దిగజారాయి.అలాగే అదే మీడియా ఛానెల్స్ కు ఉన్న పత్రికలూ అంతే ఆవు ఎక్కడో మేస్తే దూడ ఇంకెక్కడో మేస్తుందా అన్నట్టుగా ఛానెల్స్ ఏం చూపిస్తారో దానికి మరింత మసాలా దట్టించి విషపూరిత వార్తలను మన పత్రికల వారు ముద్రిస్తారు. అలా వైసీపీ అధినేత మరియు ఏపీ ...
Read More »జగన్కు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..
మహిళలు, చిన్నారుల రక్షణతో పాటు బాధితులకు సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై కేంద్ర హోం శాఖ కసరత్తు చేపట్టింది. దిశ బిల్లుకు చట్ట రూపం కల్పించే చర్యలను కేంద్రం ప్రారంభించింది. కొన్ని సాంకేతిక అంశాలపై కేంద్ర హోం శాఖ కోరిన వివరాలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. ఈ నేపథ్యంలో బిల్లుకు చట్ట రూపం ఇచ్చే దిశగా కేంద్ర కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో మూడు నెలల క్రితం ‘దిశ’ అనే యువతిపై నలుగురు వ్యక్తులు ...
Read More »మోడీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతెరా వేదికగా సాగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ఆద్యంతం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తుతూ ప్రసంగం కొనసాగించారు. నమస్తే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్ దేశం కోసం మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసల్లో ముంచెత్తారు. భారత్- అమెరికాలు 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని ప్రకటించారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని అంటూ అమెరికా భారత్ను అభిమానిస్తుందని అన్నారు. ట్రంప్ ఇంకా ఏమన్నారంటే…‘ భారత్, అమెరికా ఎప్పటికీ నమ్మదగ్గ స్నేహితులు..లక్ష మందికి ...
Read More »ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికిన మోడీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు. ట్రంప్తో పాటు ఆయన కూతురు, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్, అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత్కు విచ్చేసింది. ఎయిర్పోర్టు సర్కిళ్లో ఏర్పాటు చేసిన కళకారుల ప్రదర్శన బృందాలు ట్రంప్కు ...
Read More »