ప్రతిపక్షనేత చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ ‘మనవాళ్లు బ్రీఫుడు మీ’ అన్న వాయిస్ మీదేనని పసిపిల్లలూ గుర్తుపట్టారు. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారని మీడియా ఇంటర్వ్యూల్లో గద్దించిన సంగతి ఎవరూ మరిచి పోలేదంటూ’’ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చురకలు అంటించారు.‘‘ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్ల కోసం కింద మీదా పడ్డట్టు వికీలీక్స్ బయట పెట్టింది. దొంగే దొంగని అరిచినట్టు లేదూ?’’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Read More »Tag Archives: mp
‘వికేంద్రీకరణ వల్ల అమరావతికొచ్చిన నష్టమేం లేదు’
వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజధాని విషయమై ట్విటర్ వేదికగా స్పందించారు.’ వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టమేమీ లేదు. మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి గారి ఏఎమ్ఆర్డీఏ సమీక్ష చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరు’ అని ట్వీట్ చేశారు.
Read More »భగవంతుడి దయ, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలం
వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. దాదాపు పదిరోజుల నుంచి హోం ఐసోలేషన్లో ఉంటున్న ఆయన శనివారం రోజున కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. ‘భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు
Read More »మల్లేష్ను పరామర్శించిన ఎంపీ విజయసాయి రెడ్డి
పరవాడ ఫార్మా సిటీ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆరిలోవ హెల్త్సిటీలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెమిస్ట్ మల్లేష్ను ఎంపీలు విజయసాయి రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణలు పరామర్శించారు. బుధవారం ఉదయం నేరుగా విజయవాడ నుంచి విశాఖ చేరుకున్న ఎంపీలు పినాకిల్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న మల్లేష్ను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Read More »ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Read More »సోషల్ మీడియా ఫేక్ గ్యాంగ్లకు ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరిక
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో సాగిస్తున్న దుష్ర్పచారంపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫేక్గ్యాంగ్పై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ మొదలెట్టారని, సైబర్ క్రైమ్ చట్టం నుండి నిందితులు ఎవరూ కూడా తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు.ఫేక్ ...
Read More »కరోనా పరీక్షలు చేయించుకున్న విశాఖ ఎంపీ
స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ ఎంపీకి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరోనా వ్యాధి పట్ల అప్రమత్తత అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా లాక్డౌన్ నియమ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.
Read More »